వారెవ్వా.. ధోని జట్టు.. ప్రపంచ రికార్డ్?
అదే సమయంలో ఈ మ్యాచ్ ద్వారా అటు ఝార్ఖండ్ ఒక అపప్రధ కూడా మూటకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 591 పరుగుల ఆధిక్యం లభించింది.అయినప్పటికి కూడా ఇక ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడనియకపోగా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయకుండా ఆడి అభిమానుల చీత్కారాలు ఎదుర్కొంది. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా రికార్డుల కోసమే జార్ఖండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడిందని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఝార్ఖండ్ జట్టు. ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 880 పరుగులకు ఆలవుట్ అయింది ఝార్ఖండ్ జట్టు. ఝార్ఖండ్ సాధించిన స్కోరు చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డులకెక్కింది.
ఝార్ఖండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడు శతకాలు మూడు అర్థ శతకాలు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ కుమార్ కుశగ్ర 266 పరుగులతో అదరగొట్టాడు. ఇక విరాట్ సింగ్ 105 పరుగులతో శతకం బాదాడు. నదిమ్ 177 పరుగులు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో నాగాలాండ్ జట్టు కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులకే కుప్పకూలి పోవడంతో ఝార్ఖండ్ జట్టు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆదిక్యత లభించడం గమనార్హం. ఇక ఏదేమైనా కొంతమంది ధోని జట్టు మంచి రికార్డు సృష్టించింది అనుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం.