మెగా వేలం.. తెలుగు ప్లేయర్ కు లక్కీ ఛాన్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇది కేవలం ఒక దేశీయ లీగ్ మాత్రమే కాదు. ఎంతో మంది యువ ఆటగాళ్ల జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి రాణించాలి అని ఆశ పడే ప్రతి ఒక యువ ఆటగాడికి ఐపీఎల్ ఒక ఆశా కిరణం. ఇటీవలి కాలం లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించిన వారే అంతర్జాతీయ క్రికెట్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమం లోనే ఇక ఐపీఎల్ లో పాల్గొనడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తుంటారు.


 ప్రతి ఏడాది ఐపీఎల్ లో కొత్త ఆటగాళ్లు సత్తా చాటు తుంటారు. ఇక తర్వాత భారత జట్టు లో చోటు దక్కించు కోవడం చేస్తున్నారు. అయితే ఐపీఎల్ మెగా వేలం జరిగినప్పుడల్లా తెలుగు ఆటగాళ్లు ఎంత మంది సెలక్ట్ అవుతారు.. ఎంత ధర కి ఫ్రాంచైజీ లు వారిని కొనుగోలు చేశాయి. తెల్సు  కోవటానికి ఆసక్తి చూపుతారు  తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరూ. ఇక ఇప్పుడు మెగా వేలం నేపథ్యం లో తెలుగు ఆటగాళ్లు ఐపీఎల్లో చోటు దక్కించు కోవాలని కోరుకున్నారు.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటారు అన్నది తెలుస్తుంది. మెగా వేలంలో తెలుగు ప్లేయర్ ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విని హెబ్బార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఇతను 2015 నుంచి రంజీల్లో ఆంధ్ర టీం తరఫున ఆడుతున్నాడు. అంతేకాకుండా  సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా 2017 నుంచి 2019 వరకు వరుసగా ఆడుతున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఇక అంతర్జాతీయ జట్టులో ఆడటమే తన లక్ష్యం అంటూ చెబుతున్నాడు ఈ 26 ఏళ్ల ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: