టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది.. ట్రోల్ వైరల్?
ఇక ఇప్పుడు టీమిండియా గురించి ఇలాంటి ట్రోల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. మొదటి రెండు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా రాణించింది. ప్రత్యర్థులపై భారీ తేడాతో విజయం సాధించి ఎంతో అద్భుతమైన రన్రేట్ సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితేటీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరాలి అంటే న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే భారత అభిమానులందరూ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని మా పూర్తిస్థాయి మద్దతు మీకే ఉంటుంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి అంటు కోరుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే దీనిని ఉద్దేశిస్తూ టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు ఎలా మద్దతు ఇస్తున్నారు ఎలా ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని తెలిపేలా ఒక ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ఈ ఫోటోలో ధోని రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతూ ఉంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఏకంగా రషీద్ ఖాన్ షర్ట్ సరి చేస్తున్నారు. తప్పకుండా గెలవాలి అంటూ ప్రోత్సహిస్తున్నట్లు గా ఉంది. ఇక ఇది చూసిన అందరూ నవ్వుకుంటున్నారు.