భారత్ - పాక్ మ్యాచ్ : మాయం అయిపోయిన సానియా మీర్జా
అయితే దాయాది దేశాలైన భారత జట్టు పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో గ్రూప్ 2 లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు లీగ్ దశలోనే పోటీపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా అందులో గెలిచిన జట్టు అభిమానులు ఒదిన జట్టును ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఏ జట్టు గెలిచినా... ఏ జట్టు ఓడిపోయిన ట్రోల్ అయ్యే మొదటి వ్యక్తులలో సానియా మీర్జా ఉంటుంది. ఎందుకంటే సానియా మీర్జా కు మన భారత్ పుట్టినిల్లు కాగా పాకిస్థాన్ మెట్టినిల్లు. సానియా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు అయిన షోయబ్ మాలిక్ ను 2010 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అదే ఈ రెండు జట్లు తలపడగా సమయంలో తలనొప్పిని తెచ్చిపెడుతోంది. అయితే ఈ ప్రపంచ కప్ లో రెండు జట్లు పోటీ పడుతున్న సమయంలో అభిమానుల నుంచి తప్పించుకోవడానికి సోషల్ మీడియా నుండి మాయం కావాలని సానియా మీర్జా నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న రోజు సోషల్ మీడియా నుండి తాను అదృష్టము అదృశ్యం అవుతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సానియా మీర్జా.