రోహిత్ శర్మ లో కంగారు పుట్టిస్తున్న కరోనా.. ఎందుకో తెలుసా..?
ఆస్ట్రేలియా టూర్ కి ఆలస్యంగా వెళ్లిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం సిడ్నీలోని డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో క్వారంటైన్ లో గడుపుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సిడ్నీ లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉంది అన్న విషయం తెలుస్తుంది. అక్కడి అధికారులు ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ కంట్రోల్ కావడం లేదు. ఈ క్రమంలోనే సిడ్నీ సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. రోహిత్ శర్మ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో ఉండగా ఒక అపార్ట్మెంట్ నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేకపోయింది.
కాగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగే సమయానికి 14 రోజులకు క్వారంటైన్ పూర్తిచేసుకుని రోహిత్ శర్మ టీమిండియా జట్టులో కలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ తో సిడ్ని ప్రజలతోపాటు రోహిత్ శర్మ లో కూడా కంగారును పెంచుతున్నాయి ఎందుకంటే.. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్ ఆస్ట్రేలియా జట్లు మూడవ టెస్ట్ ఆడనున్నాయి. అయితే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోయింది. 2020 తర్వాత నేరుగా మూడో టెస్టులో హిట్మ్యాన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.