నోరు విప్పిన సురేష్ రైనా.. అది దారుణం కాదు.. ఘోరం అంటూ..?

praveen
ఇటీవలే సీఎస్కే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆడేందుకు యూఏఈ వరకు వెళ్లిన సురేష్ రైనా ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుని ఇంటి బాట పట్టాడు. ఇక ఐపీఎల్ నుండి సురేష్ రైనా తప్పుకోవడంతో ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. కానీ మొదటిసారి సురేష్ రైనా తాను ఐపీఎల్ నుంచి తప్పుకోవడం పై నోరు విప్పాడు. కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా స్పందించిన సురేష్ రైనా... పంజాబ్ లో  తమ కుటుంబం లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన గురించి మాట్లాడారు.



 ఇటీవలే తమ కుటుంబం లో జరిగిన సంఘటన దారుణం కంటే ఘోరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సురేష్ రైనా. తమ మామయ్య హత్యకు గురయ్యారని...  మేనత్త ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి తీవ్ర గాయాలపాలై ఆరోగ్యం క్షీణించి ఒక సోదరుడు కూడా కన్నుమూసాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అత్తయ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని ప్రస్తుతం వెంటిలేటర్ పై  చికిత్స పొందుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు సురేష్ రైనా.



 ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే దానిపై తమకు ఎవరికీ సమాచారం లేదని... కానీ తమ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది అంటూ  తెలిపారు సురేష్ రైనా. ఇంత దారుణాన్ని ఎవరు చేసారో ఎందుకు చేసారో కూడా అర్థం కావడం లేదని.. పంజాబ్ పోలీసులు త్వరగా దర్యాప్తు జరపాలని కోరుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇంత  ఘోరానికి పాల్పడిన నేరస్తులు  మరిన్ని దారుణాలకు  పాల్పడకముందే వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. తన పోస్టుకు పంజాబ్  ముఖ్యమంత్రిని కూడా ట్యాగ్  చేశారు. దీంతో రైనా పై వచ్చిన రూమర్లన్ని  పటాపంచలైపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: