ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో !

Durga Writes

అతను ఓ క్రికెటర్.. అంతేకాదు అందగాడు కూడా.. అతను చాలా తక్కువమందికి తెలిసిన.. కొంతమందే అభిమానులు ఉన్న.. అతను ఆడిన కొన్ని ఆటలా వల్లే అతను రికార్డుకెక్కాడు. అంత రికార్డు ఎక్కేంత ఏమి ఆడాడు ? అంతగా ఏమి సాధించాడు అని అందరూ అనుకోవచ్చు... కానీ అతను ఓ టెస్టు మ్యాచులో ట్రిపుల్ సెంచరీ చేశాడు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక బ్యాట్స్‌మన్ అయిన కరుణ్ నాయర్ 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ (303) చేశాడు. ఫలితంగా ట్రిపుల్ సాధించిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు సెహ్వాగ్ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు, టెస్టుల్లో తన తొలి సెంచరీనే 'ట్రిపుల్'గా మలిచి ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు.

 

అయితే ఇప్పుడు అతని గురించి ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా ? అదేనండి.. నిన్న అతని పెళ్లి జరిగింది. టీమిండియా క్రికెటర్, ట్రిపుల్ సెంచరీ హీరో అయినా కరుణ్ నాయర్ నేడు పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలు సనయా తంకరివాలాను నిన్న పెళ్లి చేసుకున్నాడు. ఉదయ్‌పూర్‌లో నిన్న శుక్రవారం ఈ వివాహం జరిగింది. అయితే వివాహానికి అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.  

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
To a lifetime of {{RelevantDataTitle}}