ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధం
ఐపీఎల్-2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలానికి ఇక రంగం సిద్దమైంది. మొత్తం 971 మంది క్రికెటర్లు వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఇందులో కేవలం షార్ట్లిస్ట్ 332 మంది అయ్యారు. తాము కోరుకుంటున్న 332 మంది ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలను రిజిష్టర్ చేసుకున్న ఆటగాళ్ల నుంచి ఫైనలైజ్ చేశారు.
ఇందులో ఈ జాబితాలో 43 మంది భారత్కు చెందినవారు కాగా మిగతావారు అంతా విదేశీ క్రికెటర్లు. ఈ 43 మందిలో టీమిండియా తరుపున 19 మంది ప్రాతినిథ్యం వహించిన వారే ఉండటం గొప్ప విశేషం. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు 73 మందిని ఈ జాబితా నుంచి గరిష్టంగా మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీంతో కోల్కతా వేదికగా డిసెంబర్ 19న జరగనున్న ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ వేలంలో ఎంతో మంది అనామక క్రికెటర్లను పలు ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో ఛేజిక్కించుకున్నాయి. దీంతో ఈసారి ఏ క్రికెటర్పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తారో అని మరింత ఆసక్తికరంగా మారింది. టీ10లీగ్ యూఏఈ వేదికగా జరిగిన కేవలం 25 బంతుల్లోనే సెంచరీ సాధించిన సర్రే ఆటగాడు విల్ జాక్స్పైనే అందరి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ సారి వేలంలోకి వచ్చిన క్రికెటర్లలో ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్స్, ఏంజెలో మాథ్యూస్, హెజిల్వుడ్, స్టెయిన్, ముస్తాఫిజుర్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లాలు మాములు కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్లో ఆకట్టుకున్న విలియమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యాడు. దీంతో ఈ క్రికెటర్పై కూడా ఫ్రాంచైజీలు కన్నేశాయి.