మరో బిగ్గెస్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ను మెప్పించాడు ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తన కెరియర్లో మంచి హిట్ సినిమాలను తీశాడు. హిట్ లు అన్న సంబంధం లేకుండా దూసుకుపోయాడు. ఇటీవల ఛత్రపతి హిందీ రీమేక్ సినిమా ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో ఆయన చేస్తున్న సినిమాలు చాలా వరకి ఆగిపోయాయి.

కాస్త బాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరొక రెండేళ్ల పాటు వరుస సినిమాలతో బిజీగా మారనున్నాడు.  అయితే తాజాగా ఇప్పుడు శ్రీనివాస్ సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కూడా కాబోతోంది ఇక ఈ సినిమాతో పాటు కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి అనే మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రారంభం కాబోతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ యంగ్ హీరోకి సంబంధించిన

 ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అవేంటంటే ఈ సినిమాల తరువాత శ్రీనివాస్ త్వరలోనే ఒక బిగ్గెస్ట్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో బైరెడ్డి దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కు నచ్చడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడ క్ష న్ కార్యక్రమాలు జరిపింది. ఈ సినిమాను ప్రారంభించడానికి సరైన నిర్మాణ సంస్థ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.ఇటీవలే సాయి శ్రీనివాస్ షైన్ స్క్రీన్స్ మరియు మూన్ షైన్ పిక్చర్స్ సంస్థలలో చిత్రాలు చేసందుకు సైన్ చేశాడు.తాజాగా ఓ నిర్మాణ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: