' యరపతినేని ' స్ట్రాంగ్ వార్నింగ్.. ' కాసు ' కు తడిపేశాడుగా!
దీంతో వైసీపీ పక్షాన ప్రచారం చేసేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్నది ఆ పార్టీ సీనియర్ లు సైతం అంగీకరిస్తున్న విషయం. ఇక, టీడీపీ తరఫున ఇప్పటికే రెండు సార్లు.. చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేశారు. యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఇక్కడ ప్రచారం చేశారు. మొత్తంగా టీడీపీ ఊపు ఒక రేంజ్లో కనిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి చాలా యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో సైకిల్ పరుగులు ఖాయమనే అంచనాకు అన్ని సర్వేలు వచ్చేశాయి.
మరోవైపు.. టీడీపీ అభ్యర్థి, ఏడు సార్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. జోరు కొనసాగుతోంది. తన ప్రచారంలో ఆయన పేదలపై వరాలు కురిపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అవినీతి పరులపై నిప్పు లు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే యరపతినేని ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కాసుకు తడిచిపోయేలా చేసిందన్న చర్చలే నియోజకవర్గంలో తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా దైద గ్రామంలో పర్యటించారు యరపతినేని. ఇక్కడి సమస్యలను ప్రస్తావించారు.
దైద గ్రామాన్ని.. ఇక్కడి వనరులను కూడా.. వైసీపీ నాయకులు ఐదేళ్లుగా దోచుకున్నారని యరపతినేని విమర్శించారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజలను, వనరులను దోచుకున్నవారిని తాను వదిలి పెట్టేది లేదని.. కాసు మహేష్రెడ్డి సహా.. దోపిడీ చేసిన ప్రతి ఒక్కరినీ తాము అధికారంలోకి రాగానే.. జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అతేకాదు.. విచారణ జరిపించి.. వారు దోచుకున్న సొత్తును స్వాధీనం కూడా చేసుకుంటామని చెప్పారు. ఈ పరిణామాలతో కాసు వర్గం ఆయనకు దూరమైందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాసుకు కూడా.. తడచిపోయిందని అంటున్నారు.