బుమ్రా పై ప్రసంశలు కురిపించిన మలింగా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాది ప్రత్యేక స్థానం. ఎందుకనగా ఆయన ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో యార్కర్లు, స్లోబాల్స్ సంధించడంలో గొప్పవాడు , జస్ప్రీత్ ఆట ఆరంభంలో కానీ, చివర్లో కానీ మ్యాచ్ను శాసించడంలో ఇతన్ని మించి ఎవ్వరు లేరు . బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కచ్చితమైన యార్కర్లతో హడలెత్తించడంలో ఎంతో పరిణితి సాధించాడు. దాంతోనే భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ బౌలర్గా మారిపోయాడు.
బుమ్రా యార్కర్ల టిప్స్ను శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగా నుంచి నేర్చుకున్నాడు .ఎంతలా అంటే అసలు అంత కచ్చితమైన యార్కర్లు ఎలా వేస్తున్నాడో గురువు మలింగాకు తెలియనంతగా బుమ్రా రాటుదేలిపోయాడు.తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకూ బుమ్రా బౌలింగ్ను విమర్శించిన దాఖలాలు దాదాపు లేవంటేనే అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మలింగ్ ఇదే విషయాన్ని ఇప్పుడు ఒప్పుకున్నాడు.మలింగ్ మాట్లాడుతూ ... ‘ అతని బౌలింగ్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బుమ్రా అంత కఠినమైన యార్కర్లను ఎలా సంధిస్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో.. దాన్ని నేనే నమ్మలేకున్నా. నేను బుమ్రా బౌలింగ్ మెరుగు పడటానికి కొన్ని సలహాలు ఇచ్చా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిచ్చిన టిప్స్ తన బుర్రతో మరింత పదును పెట్టాడు. ఏ విషయాన్నైనా బుమ్రా తొందరగానే నేర్చుకుంటాడు. ఇద్దరం కలిసి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడటంతో బౌలింగ్ మెళకువలను నాతో షేర్ చేసుకునే వాడు. నా కంటే మంచి ఫలితాల్ని రాబట్టడంలో బుమ్రా సక్సెస్ అయ్యాడు’ అని మలింగా కొనియాడాడు. ఇక సీనియర్ క్రికెటర్లు యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వాల్సిన అవరసం ఉందని మలింగా తెలిపాడు.
బుమ్రా 2008లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు .. అదే ఫ్రాంచైజీకి 2018లో మెంటార్గా పని చేశాడు. మళ్లీ ముంబై తరఫున 2019లో ఆటగాడిగా బరిలోకి దిగాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ను చివరి వికెట్గా మలింగా ఔట్ చేయడంతో ముంబై ట్రోఫీని గెలిచింది. ఇక బుమ్రా 2013 నుంచి ముంబై ఇండియన్స్కు ఆడుతూ వస్తున్నాడు. దాంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో కూడా మలింగా-బుమ్రాలు ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ముంబై ఇండియన్స్ వీరిని జట్టుతో పాటు అంటిపెట్టుకుంది.