అయ్యప్ప భక్తులపై ఆర్మీ జవాన్ల దౌర్జన్యం..!

తమిళనాడు లోని కోయంబత్తూరు నుంచి వస్తున్న అయ్యప్ప స్వాములతో గొడవకు దిగిన ఇద్దరు ఆర్మీ జవాన్లను తిరుపతి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామికి ఇరుముళ్లు సమర్పించుకుని శబరి ఎక్స్ ప్రెస్ లో హైదరాబా ద్ కు తిరుగు ప్రయాణం చేస్తున్న కొంత మంది స్వాములతో ఇద్దరు ఆర్మీ జవాన్లు దురుసుగా ప్రవర్తించారు.

మద్యం మత్తులో స్వాములతో గొడవకు దిగిన జవాన్లు వారి మాలలు తెంచారు. అయ్యప్ప భక్తులైప దాడి చేసేందుకు ప్రయత్నించారు. రైల్వే పోలీసులకు అయ్యప్ప స్వాములు సమాచారం అందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆర్మీజవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు ఆర్మీ జవాన్లు శ్రీకాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. రైల్లో వారు సృష్టించిన హడావిడిని కొంత మంది అయ్యప్ప స్వాములు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి పోలీసులకు అందచేశారు. వీటి ఆధారంగా పోలీసులు జవాన్లపై కఠిన చర్యలు తీసు కుంటామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: