పాకిస్తాన్ తో మ్యాచ్ కి ముందు.. ఇండియాకు గుడ్ న్యూస్?

praveen
అందరూ ఎదురుచూసిన.. ఇప్పుడు వరకు అందరూ చర్చించుకున్న దాయాదులు సమరానికి వేలయ్యింది. ఇక ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఈ మ్యాచ్ కోసం వేళ్లపై రోజులు లెక్క పెట్టుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక నేడు మరికొన్ని గంటల్లో ఇక పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది.. ప్రస్తుతం ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇరుదేశాల అభిమానులు అయితే ఈ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

 అయితే గత ఏడాది ప్రపంచ కప్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తూ ఉండగా.. ఇక ఏఈ డాది కూడా విజయం సాధించి వరుసగా రెండో విజయం నమోదు చేయాలని పాకిస్తాన్ ఆశగా ఎదురుచూస్తుంది ఇక నేడు జరగబోయే మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరగబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనే టీమిండియా కు మ్యాచ్ కి ముందే ఒక గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది. పాకిస్తాన్ కు చెందిన స్టార్ ఆటగాడు ఫిట్నెస్ కారణంగా మ్యాచ్కు దూరం అయ్యాడట. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో  స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఫక్కర్ జమాన్ ఇండియాతో మ్యాచ్లో ఆడటం లేదట.

 ఇటీవల ఈ విషయాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం  ప్రకటించాడు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి పక్కర్ జమాన్  గాయం కారణంగా చికిత్స పొందుతున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే గాయం బారి నుంచి బయట పడుతున్నాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే అతను పూర్తిగా సాధించకపోవడంతో తొలి మ్యాచ్ ఆడటం లేదని కెప్టెన్ బాబర్ చెప్పుకొచ్చాడు. ఇక మరో స్టార్ బ్యాట్స్మెన్ షాన్ మసూద్ మాత్రం ప్రస్తుతం తొలి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు.. కాగా ఫకర్ జమాన్ ప్రపంచంలోని మేటి ఆటకాళ్లలో ఒకరు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: