పాకిస్తాన్ తో మ్యాచ్ కి ముందు.. ఇండియాకు గుడ్ న్యూస్?
అయితే గత ఏడాది ప్రపంచ కప్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తూ ఉండగా.. ఇక ఏఈ డాది కూడా విజయం సాధించి వరుసగా రెండో విజయం నమోదు చేయాలని పాకిస్తాన్ ఆశగా ఎదురుచూస్తుంది ఇక నేడు జరగబోయే మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరగబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనే టీమిండియా కు మ్యాచ్ కి ముందే ఒక గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది. పాకిస్తాన్ కు చెందిన స్టార్ ఆటగాడు ఫిట్నెస్ కారణంగా మ్యాచ్కు దూరం అయ్యాడట. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఫక్కర్ జమాన్ ఇండియాతో మ్యాచ్లో ఆడటం లేదట.
ఇటీవల ఈ విషయాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ప్రకటించాడు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి పక్కర్ జమాన్ గాయం కారణంగా చికిత్స పొందుతున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే గాయం బారి నుంచి బయట పడుతున్నాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే అతను పూర్తిగా సాధించకపోవడంతో తొలి మ్యాచ్ ఆడటం లేదని కెప్టెన్ బాబర్ చెప్పుకొచ్చాడు. ఇక మరో స్టార్ బ్యాట్స్మెన్ షాన్ మసూద్ మాత్రం ప్రస్తుతం తొలి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు.. కాగా ఫకర్ జమాన్ ప్రపంచంలోని మేటి ఆటకాళ్లలో ఒకరు అన్న విషయం తెలిసిందే.