భారత వన్డే కెప్టెన్ గా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మ 10 ఏళ్ల కింద చేసిన ట్వీట్ ట్విట్టర్లో ఇప్పుడు వైరల్గా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత టెస్ట్ జట్టును ప్రకటించింది, అయితే కొత్త వైట్-బాల్ కెప్టెన్గా రోహిత్ నియామకం సౌత్ ఆఫ్రికా పర్యటనకు ముందు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే రోహిత్ పదేళ్ల నాటి ట్వీట్ ట్విట్టర్లో వైరల్గా మారింది. 2011 ఐసీసీ ప్రపంచ కప్లో భారత జట్టులో లేనందుకు రోహిత్ తన నిరాశను ఈ ట్వీట్లో వ్యక్తం చేశాడు. "వరల్డ్ కప్ స్క్వాడ్లో భాగం కానందుకు నిజంగా నిరాశ చెందాను.. నేను ఇక్కడ నుండి ముందుకు వెళ్లాలి.. కానీ నిజాయితీగా ఇది పెద్ద ఎదురుదెబ్బ..!" అని 2011లో రోహిత్ ట్వీట్ చేశాడు. అయితే 2011లో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై భారత్ గెలవడంతో వన్డే ప్రపంచకప్ టైటిల్ను సాధించిన జట్టులో ఉండే అవకాశాన్ని రోహిత్ కోల్పోయాడు. ఆ తర్వాత ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క 2015 మరియు 2019 ఎడిషన్లను గెలవడంలో భారత్ విఫలమైంది, రెండు సందర్భాల్లోనూ సెమీస్కు దూసుకెళ్లింది.
ఇక 2023లో భారత్లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ జట్టును టైటిల్కి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. వన్డే జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయడమే కాకుండా, ఫామ్లో లేని అజింక్య రహానే స్థానంలో రోహిత్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. గత నెలలో, మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో న్యూజిలాండ్ ను భారత్ ఓడించి, భారత టీ 20 జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే రెగ్యులర్ కెప్టెన్ గా అతని మొదటి వన్డే అసైన్మెంట్ రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో వస్తుంది, ఇక్కడ మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ మూడు వన్డే లు ఆడుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ కు ఇంకా బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.