ఏమైంది యనమల గారూ? ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?

guyyala Navya
వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన రాజధానిపై చేసిన వ్యాఖ్యలను అడ్డు పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. 


ఈ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. జగన్ రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారంటూ యనమల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఈ ట్విట్ కి నెటిజన్లు కూడా తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ' ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?' అంటూ తెలుగుదేశం పార్టీని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.  


ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా?ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?@JaiTDP @ncbn

— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: