ఏపీ అడ్వకేట్ జనరల్ గా సుబ్రమణ్య శ్రీరామ్!

Edari Rama Krishna
ఏపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనాపరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ఐదేళ్లలో ఎలా నెరవేర్చాలనే ఆలోచనతో తన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.   

సిఎస్ సుబ్రహ్మణ్యం బదిలీ కార్యక్రమాన్ని ఒక క్రమంలో వరసపెట్టి అందరినీ బదిలీ చేసేస్తున్నారు.  గత ప్రభుత్వ హయాంలో పని చేసిన కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ లో ఉన్నవారిని బదీలు చేస్తూ నిజాయితీ..రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడే ఆఫీసర్లను నియామకం చేస్తున్నారు. 

ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై మంది అధికారులను బదిలీ చేయగా ఇప్పుడు తాజాగా ఏపీ అడ్వకేట్ జనరల్ గా సుబ్రమణ్య శ్రీరామ్ ను నియమించారు. ఈమేరకు సీఎస్ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: