ఇంటర్ ఫలితాల్లో తప్పులు నిజమే...
ప్రధాన సబ్జెక్టుల విషయంలో ఫలితా తేడారాలేదన్నారు. 496 మంది విద్యార్థుల విషయంలో ఎగ్జామ్ సెంటర్లో కేటాయింపుల్లో తప్పులు జరిగినట్లు తెలిపారు. అందువల్లనే ఆబ్సెంట్ -పాస్ అనే గందరగోళం ఏర్పడినట్లు మీడియాకు వివరించారు జనార్దన్రెడ్డి. ఒక ఓఎంఆర్ షీట్లో మాత్రం సరిగా బబుల్ చేయక పోవడం వల్ల 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించి అధికారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుత ఏజెన్సీ డేటా ప్రాసెసింగ్ చేస్తున్నట్లుగానే.. దీనికి ఈక్వల్గా మరో ఏజెన్సీతో కూడా డేటా ప్రాసెసింగ్ చేయించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఆ రెండు ఏజెన్సీలు ఇచ్చిన ఫలితాలను కరెక్ట్ వచ్చాయో లేదోనని చెక్ చేసుకోవాలని కమిటీ బోర్డుకు సూచించింది. అంతా ఓకే అనుకుని.. వంద శాతం కరెక్ట్ ఉందా లేదా అని నిర్దారించుకున్న తర్వాతనే విడుదల చేయాలని సూచించింది.