చంద్రబాబుతో కలసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జైలుకు వెళ్ళటం ఖాయం!

ఆంద్రజ్యోతి రాదాకృష్ణ పై వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తనకు సంబందించి నకిలీ ఆడియో ను సృష్టించి ప్రచారం చేస్తున్నారని,దానిని ఋజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. దీనిపై తాను కేసు పెడుతున్నాని ఆయన చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో ఇంచుమించు రాధాకృష్ణ, ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలతో పాటు వివిధ రూపాల్లో ₹1500 కోట్లు కేటాయించడం జరిగింది. 


ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయ సాయి రెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పూర్తి అర్థమైందని, అందుకే వైఎస్సార్‌సీపీ నేతలపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లుగా చేసిన దోపిడీలకు సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా బాబుతోపాటు జైలుకు వెళ్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. 


అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరో ₹1500 కోట్లకు సెటిల్‌మెంట్లు చేశారు. పత్రికాముఖంగా చెబుతున్నా. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళతాడు. ఈరోజు ఆంధ్రజ్యోతి లో నేను మా పార్టీ అధ్యక్షుడిని కించపరిచేలా మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియో సృష్టించి దుష్ప్రచారం చేస్తూ ప్రోగ్రామ్‌ టెలీకాస్ట్‌ చేసింది. ఆంధ్రజ్యోతి, ఒక కులజ్యోతి పత్రిక మాత్రమే. ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తోంది. గతంలో రాధాకృష్ణ కిరోసిన్‌, రేషన్‌ బియ్యం దొంగ. ఒక దొంగకు ఇంతకన్నా మంచి ఆలోచనలు, ఐడియాలు వస్తాయా?. 

మానవతా విలువలు విడిచి, వ్యక్తుల వ్యక్తిత్వాలను కించపత్=రుస్తూ శీలహనం చేస్తూ దాన్ని దుష్ప్రచారం చేస్తూ సమాజంలో మాట్లాడకూడని విషయాలని కూడా అసభ్య కరంగా ప్రసారం చేస్తున్నారు. వీటన్నింటిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అంతేకాదు చట్టపరంగా కూడా ముందుకు వెళతానని అన్నారు. 

రాధాకృష్ణ నిజమైన పాత్రికేయుడైతే, తన ఛానల్‌ టెలికాస్ట్‌ లో ప్రసారమైన వాయిస్‌ ను నాదని నిరూపించాలని సూటిగా ప్రశ్నించారు. నా వాయిస్‌ అందరికీ తెలుసు. కొంత మంది సామాన్య జనానికి తెలియక పోవచు నేఅ ఉద్దేశంతో తప్పుడు ప్రచారం ద్వారా టీడీపీకి ప్రయోజనాలు సాధించి పెట్టటం కోసం పాకులాడుతోంది. నిన్న లక్ష్మీ పార్వతి, ఈరోజు నా మీద, రేపు ఇంకొకరిపై ఇలాంటి "అసభ్య అసత్య ప్రచారాలు" చేసేపనిలో ఉన్నాడు. 

రాధాకృష్ణ! నీవు జాతీయ నాయకుడివా? లేక దేశభక్తుడివా? కాదు...కాదు.. అని నేను స్పష్టంగా చెప్పగలను. సమాజానికి చీడ పురుగువి...సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి కావు. గతంలో మందకృష్ణ మాదిగను బాడుగ నేతగా నువ్వు అభివర్ణించావు. ఇప్పుడు నువ్వు కాదా! బాడుగ నేతవి కాదా! నువ్వు తెలుగు దేశం పార్టీకి అమ్ముడు పోయావు. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న రాష్ట్ర సంపదను చివరి పైసాతో సహా కక్కిస‍్తాం. నీపై ఎన్నికల సంఘానికి, ఇన్‌ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కు ఫిర్యాదు చేస్తాం. 

ఆడియోలో అసలు నా వాయిస్ అని చెప్పబడుతున్న వాయిస్‌ నిజంగా ఎవరిది అన్నది, సీఎఫ్‌ఎల్‌సీ నిర్థారణ చేసిన తర్వాతే అసలు విషయం తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటుకు కేసులో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదే నని స్పష్టం అయింది. మీరు ప్రసారం చేసినట్లుగా సన్నాయి నొక్కులు, దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, అనే పదాలు కూడా నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడే అడిగి తెలుసుకున్నా’ అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: