“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్ సామాజిక రుగ్మతల ఊబిలో పది శ్లేష్మంలో పడ్ద ఈగలాగా కొట్టుకుంటుంది. రాష్ట్రంలో ప్రకృతి వనరులపై దాడి అక్రమ తరలింపు ఊహాతీతంగా పెరిగి పోయింది. ఛాలామంది శాసన సభ్యులే ఇసుక ఖనిజాలు జలాలు వారి స్వార్ధ ప్రయోజనాలకు వాడేసుకుంటున్నారు. ప్రజలు అధికారం ఇచ్చేశి పదవీ పీఠంపై కూర్చో బెట్టిన తరవాత అదే పాలకులు దోపిడీ దొంగలుగా బహిరంగంగానే దోపిడీ చేయటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాధినేత మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ మళ్ళా మాయజేసి ఐదేళ్ళ అధికారం పొందటానికి ఉధ్యుక్తుడౌతున్నారు.


ఈ పరిస్థితికి ఊతమిస్తూ రాజ్యాంగ నాలుగవ మూల స్థంభం అనబడే సమాచార వ్యవస్థ ఒక సామాజికవర్గానికి ఒక అధికార పార్టీకి కొమ్ముకాసే దుస్థితి వచ్చింది.ఒకనాడు రాష్ట్రంలో జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ప్రముఖ తెలుగు దినపత్రిక నేడు తన స్థాయి దిగజార్చుకుంది. రాష్ట్రానికి జ్యోతి లా వెలుగులందించి మార్గనిర్దేశం చేసిన మరో దినపత్రిక నేడు ఒక కులానికి, ఒక పార్టీకి బానిసత్వం చేస్తూ కరపత్రం గా మారిపోవటం కూడా జాతికి బలమైన దెబ్బ కొట్టింది.


ఈ సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి పాలనాకాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ఇరువురు ఐఏఎస్ అధికారులు రాష్ట్రం & ప్రభుత్వం పై వివిధ రంగాల్లో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అవే పరిశీలిద్ధాం.


రాష్ట్రం అప్పుల ఊబిలోకి పడిపోయి ఇప్పటికే కొట్టుమిట్టాడుతుంది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టగా, ప్రజలను రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకినెట్టి భవిష్యత్తును అంధకారం చేసిన తెలుగు దేశం ప్రభుత్వం దాని అధినేత నారా చంద్రబాబు నాయుడు - ఎన్నికల సమయంలో  “మీ భవిష్యత్తు నా బాధ్యత”  అంటూ కొత్త నినాదాలివ్వడం ఐదు కోట్ల ఆంధ్రులను గేలి చేసినట్లు మరో మోసానికి తెరలేపినట్లు కనిపిస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం విమర్శించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీనిధి కన్వెన్షన్‌ సెంటర్‌ లో నిన్న శనివారం నిర్వహించిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌–సేవ్‌ డెమోక్రసీ’ సదస్సులో మరో మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి అజేయ కల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.


తొలుత పులివెందులలో శుక్రవారం దారుణహత్యకు గురైన మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండునిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సదస్సులో అజేయకల్లం మాట్లాడుతూ టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు.


*ఓటర్ల తొలగింపు: ఐదేళ్లలో 25 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరాలని, అయితే 2014లో 3.68 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇటీవల జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.69 కోట్లమంది ఓటర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున టీడీపీ పాలనలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. కొన్ని కులాల వారీగా ఓట్లను టార్గెట్‌ చేసి టీడీపీ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు.

*మనకున్న రీసర్చ్, పారిశ్రామిక సంస్థలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ1980కు ముందే వచ్చాయని, ఆ తర్వాత కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు నిర్మించారని అజేయకల్లం చెప్పారు.

 

*ఆర్థిక వ్యవస్థ: ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని అజేయ కల్లం అన్నారు. మన రాష్ట్రానికి ₹94000 కోట్ల గ్యారంటీ లిమిట్స్‌ కు అర్హత ఉండగా, దానిలో 30–35 శాతం మించి గత 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో గ్యారంటీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.  కానీ టీడీపీ ప్రభుత్వం 101 శాతం ఇప్పటికే గ్యారంటీ రుణం తీసు కుందని చెప్పారు. ₹350000 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వా నికే దక్కుతుందని, పోలవరం, అమరావతి శంకు స్థాపనలు, ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని నీళ్ళ ప్రాయంగా వృథా చేస్తున్నారని అన్నారు. 


*రెవెన్యూ: 2004–2014 దశాభ కాలంలో సంవత్సరానికి 39.50 శాతం లెక్కన రాష్ట్ర రెవెన్యూ 395 శాతం పెరగగా, గత నాలుగు సంవత్సరాల్లో టీడీపీ పాలనలో రాష్ట్ర రెవెన్యూ 30 శాతం కంటే తక్కువ నమోదైందని అజేయ కల్లం అన్నారు. అంటే సంవత్సరానికి కనీసం 7 శాతం కూడా పెరగలేదని చెప్పారు.

అయితే 2004–14మధ్య పెరిగిన తలసరి ఆదాయంలో సగం నమోదవుతుంటే తాము అద్భుతాలు సృష్టించామని తమ పార్టీ మద్దతు కోసమే జీవిస్తున్న ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవని, అయినా వ్యవసాయంలో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ నమోదయిందని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పశు క్షేత్రాల్లో  దొంగ లెక్కలు చూపిస్తూ కోట్లాది రూపాయిలు దండుకున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఫాం-పాండ్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇసుక ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి తాండవమాడుతుందని అజేయకల్లం అన్నారు.  

 

*ఎల్లో మీడియా తెలుగు జాతికి పట్టిన మశూచి వ్యాధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎల్లో మీడియా మశూచిలా పట్టి పీడిస్తోందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి ప్రజలను తిక మక పెట్టి టీడీపీని 2019 ఎన్నికల్లో గెలిపించాలని ఎల్లో మీడియా కంకణం కట్తుకొందని – ప్రచార ప్రకటనం విపరీతంగా పొందుతూ రష్ట్ర ఆర్ధిక సార్ఫాన్ని పీల్చేస్తుందనే ప్రచారానికి ఐవైఆర్ మాటలు నిజమని ఋజువు చేస్తున్నాయి.

 ఎంత సేపటికీ నాలుగు బిల్డింగ్‌లు వచ్చాయి, ఫిల్లర్‌ ఇలా వేశాం, ఊచలు ఇలా కట్టాం అని ప్రచారం చేసుకుంటు న్నారని మండిపడ్డారు. ఇదే ఒక అద్భుతం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు.


*బానిసత్వంలో పోలీస్‌ వ్యవస్థ: పోలీస్‌ వ్యవస్థను సైతం నాశనంచేసి పోలీస్ బాస్ నుండి క్రింది స్థాయి కానిస్తేబుల్ హోం గార్డ్ వరకు అందరినీ పార్టీ కార్యకర్త ల్లా వాడేసు కుంటున్నారని అజేయకల్లం విమర్శించారు. 2000 మందికి ప్రమోషన్లు ఇస్తే సీఎం కు సన్మానం చేసి, ఓటు వేసి రుణం తీర్చుకుంటామని పోలీసులు ప్రమాణాలు చేశారని, వాళ్లను పోలీసులు అనాలో “ఖాకీ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలు” అనాలో అర్థం కావడం లేదని అన్నారు.

 

*అవినీతిలో అందనంత ఎత్తులో ఏపి: భారత దేశంలో అత్యధికంగా అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌–1 స్థానంలో నిలుస్తుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో ప్రాంతీయ అసమానతలు గణనీయంగా పెరిగాయని, జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.

ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ పాలనలో చట్టసభల్లో ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకు లేకుండా చేశారన్నారు. రైల్వేస్‌ మాజీ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎం.పాపిరెడ్డి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాఘవరెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ చుండూరు సాయి పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: