ఇదేనా ప్రశాంతత అంటే ఇ్రమాన్ జీ? లేటెస్ట్ గా పది మందిని చంపేశారు

KSK
శాంతి శాంతి అని పైకి చెప్పడం మాత్రమే పాకిస్తాన్ యొక్క నైజం అని మరొక్కసారి అర్ధం ఐపోయింది. తనదైన శైలి లో భారత్ జాగ్రత్తగా తన దేశాన్ని కాపాడుకుంటూ ఉంటె పాకిస్తాన్ మాత్రం కవ్వింపుల విషయం లో తెగబడుతూ నే ఉంది. పూంచ్ , రాజౌరీ లలో పాకిస్తాన్ ఇప్పుడు కాల్పులకి తెగ బడింది .ఈ కారణంగా 10 మంది వరకూ భద్రతా సిబ్బంది దారుణంగా చనిపోయారు.


వింగ్ కమాండర్ అభినందన్ భారత్ లోకి వచ్చిన 24 గంటలు కూడా పూర్తి అవ్వకుండా నే పాకిస్తాన్ ఇలా చెయ్యడం చాలా దారుణమైన విషయం . భారత స్థానిక స్థావరాలు, జనాల ఇళ్ళు ఇవన్నీ లక్ష్యం గా చేసుకుని పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోవడం దురదృష్టకర విషయం. పాకిస్థాన్‌ చర్యలను విజయవంతంగా భారత్‌ బలగాలు తిప్పికొడుతున్నాయి.


ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే ఇక్కడ తిప్పి కొట్టడం అంశం కాదు కానీ పైకి మాత్రం ప్రపంచం దృష్టి లో శాంతి దూత అంటూ కహానీలు చెబుతూ లోపల మాత్రం ఇలాంటి పైసాచికత్వానికి పాల్పడుతోంది పాకిస్తాన్.


జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించడం సర్వ సాధారణం గా మారిపోయింది పాకిస్తాన్ కి. ధీటుగా మనవాళ్ళు తిప్పికొట్టగలరు కానీ అన్ని ఒప్పందాల నీ పాకిస్తాన్ పెడ చెవిన పెట్టడమే అన్నిటికంటే విసుగు వస్తున్న అంశం. 


ప్రపంచ శాంతి కోసం అంటూ కహానీలు చెప్పే ఇమ్రాన్ ఖాన్ ఇదేనా నీ నిజ స్వరూపం ? అంటున్నారు భారత దేశ జవాన్ లు !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: