జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?

KSK
ఏపీప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో హత్యాయత్నం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే. జగన్ పై దాడి జరగడంతో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయగా ..మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ కావాలని తనపై తానే దాడి చేయించుకున్నాడని కామెంట్ చేశారు.


ఈ క్రమంలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న శ్రీనివాస్ పై అనేక రకాల అనుమానాలు రక్త మవుతున్నాయి. ఈ నేపద్యంలో శ్రీనివాసుని విచారిస్తున్న సిట్ బృందం ఇప్పటి వరకు సరైన విషయాన్ని రాబట్టలేక పోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.


ముఖ్యంగా ఈ ఘటనలో జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇది వరకే ఈ తరహా హత్యలు చేసేటటువంటి గ్యాంగ్ ల దగ్గర శిక్షణ తీసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే జగన్ మీద జరిగినటువంటి దాడి ఏమి చిన్నది కాదని,ఎంతో మంది కరుడుకట్టిన హంతకులు ఎన్నో హత్యలకు ఇలాంటి చిన్నపాటి ఆయుధాలు ఉపయోగించే మనిషి శరీరాలల్లో కొన్ని సున్నితమైన చోట్ల గాయపరుస్తారని, దాని వల్ల గాయం తగిలింది అని తెలిసే లోపే ప్రాణాపాయ స్థితికి ఆ మనిషి వెళ్ళిపోతాడని అభిప్రాయపడుతున్నారు.


మొత్తంమీద జగన్ పై జరిగిన హత్యాచారం వెనుక చాలా సంవత్సరాలు శ్రీనివాస్ ట్రైనింగ్ తీసుకుని ఉంటాడని దేవుడి దయవల్ల జగన్ బతికిపోయాడు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనియర్ పోలీసు అధికారులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: