రైలు యాత్రలో జగన్ పై జరిగిన దాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి తునికి జన్మభూమి రైలు మార్గంలో బయలుదేరుతూ చేపట్టిన ఈ రైలు యాత్రపై పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఎంతగానో సంతోషించారు.


ఈ సందర్భంగా రైలు ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆగినప్పుడు అక్కడ ఉన్న కార్మికుల తో సమావేశమైన పవన్ కళ్యాణ్..ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్య గురించి సంచలన కామెంట్ చేశారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ప్రవర్తించిందని..ఒక ప్రతిపక్ష నాయకుడు పై ఈ విధంగా విమానాశ్రయంలో ఘటన జరగడం దారుణమని..పవన్ కళ్యాణ్ ఖండించారు.


తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. విజయమ్మ, షర్మిలలు తనను ఎన్నో తిట్టారని అలాగని తాను వాళ్లని ఏమీ అనలేదని తెలిపారు.


జరిగిన ఘటన విషయంలో అసలు నిజాలు బయటకు తీయాలని నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని పేర్కొన్నారు పవన్. మరియు అదే విధంగా చంద్రబాబు రాహుల్ గాంధీ కలవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు..అధికార దాహం కోసం ఈ విధంగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు పవన్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: