ఒకే సెట్ లో ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్..!!

murali krishna
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'వెట్టయాన్‌'. తెలుగులో వేటగాడు అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.జైలర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజినీకాంత్ ప్రస్తుతం 'జై భీమ్‌' డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు 32 ఏళ్ల తర్వాత అగ్ర నటులు రజనీకాంత్‌ - అమితాబ్‌ బచ్చన్‌ కలిసి తెర పంచుకుంటున్నారు.అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75 శాతం వరకు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకోగా తాజాగా 'వెట్టయాన్‌' ముంబైకి షిప్ట్ అయ్యింది. ఈ సినిమా చివరి పార్ట్ ను ముంబైలో షూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది.లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఆయన సెట్‌లో అడుగుపెట్టారు. రజనీకాంత్, అమితాబ్‌ సూట్స్‌ ధరించి హుందాగా మాట్లాడుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. ఫహాద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికాసింగ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్స్ తో కనపడటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ వెట్టైయాన్ సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజవుతుందని సమాచారం.
స్నేహితులైన ఈ స్టార్‌లు ఆ మూవీ సెట్స్‌లో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'మీ కలిసి దిగిన ఫొటోలే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో?' అంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అందా కానూన్‌', 'గిరాఫ్తార్‌', 'హమ్‌' చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. 'వేట్టయాన్‌' రజనీకాంత్‌ 170వ సినిమా. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు, రజనీకాంత్‌ 171వ సినిమాను ఖరారు చేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు 'కూలీ'. అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: