జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే సర్వేలో బయటపడిన సంచలన విషయాలు..!

KSK
వైసీపీ అధినేత జగన్ రాజకీయ సలహాదారుడు ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా ఏపీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి రాబోయే ఎన్నికలలో పార్టీ ప్రభావం ప్రజలలో ఏ విధంగా ఉందో అనే విశేషాలపై సర్వే చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ పాదయాత్ర గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే దానిపై కూడా సర్వే చేశారు పీకే టీం. తాజాగా చేసిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూసి ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయారు.


వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే జగన్ పాదయాత్ర వల్ల సామాన్య ప్రజలలో జగన్ పై నమ్మకం పెరిగిందని...అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న లక్ష కోట్లు అనే అవినీతి ఆరోపణ నమ్మడం లేదని తేలింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం రాష్ట్రంలో తీవ్ర అవినీతి కార్యకలాపాలు చేయడంతో ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి రావలసిన విభజన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్ర ప్రజలు జగన్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతున్నారు అని ఈ సర్వేలో తేలింది.


అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వ్యక్తిగా రాజకీయ నేతగా జగన్ ని బలంగా నమ్ముతున్నారు రాష్ట్ర ప్రజలు. తన తండ్రి చనిపోయిన నాటినుండి జగన్ ప్రజల మధ్య ఉంటూ మా కోసం మా హక్కుల కోసం పోరాడుతున్నారు అని చాలా మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.


రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని...తన తండ్రి మమ్మల్ని ఏవిధంగా చూసుకున్నాడో అంతకంటే ఎక్కువగానే మమ్మల్ని మా పిల్లల్ని జగన్ కచ్చితంగా చూసుకుంటాడని ప్రజలు ఈ సర్వేలో తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: