కామంతో కళ్ళు మూసుకుపోయి ఆవుపై అత్యాచారం..!

KSK
ప్రస్తుత సమాజంలో మనుషులు చాలా క్రూరంగా కామంతో కళ్లు మూసుకుపోయి మరి విచిత్రంగా ప్రవర్తిస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. ఒకపక్క అక్రమ సంబంధాలతో భార్యాభర్తల కుటుంబజీవితం కూల్ పోతుండగా మరోపక్క భర్తలేని వితంతువులు వావివరసలు లేకుండా మరి దారుణమైన పనులకు ఒడిగడుతున్నారు...ఇటువంటి పరిస్థితులలో అడ్డు వస్తున్న రక్తసంబంధులను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు.


ఈ క్రమంలో కామంతో కళ్లుమూసుకు పోయిన ఓ కామాంధుడు మూగ జీవాలపై అత్యాచారాలకు పాల్పడ్డారు.ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్ లో దుర్మార్గుడు ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. రాజ్‌గఢ్‌ జిల్లా సుతాలియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చోటే ఖాన్ అనే వ్యక్తి ఓ దేవాలయం వద్ద గల ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


అతడు అర్థరాత్రి సమయంలో ఇలా అసహజ చర్యలకు పాల్పడుతుండగా మహేష్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి గమనించాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఓ సైకోలా ప్రవర్తిస్తూ తనకే ఎదురు తిరిగాడని వ్యాపారి తెలిపారు.


దీంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఆందోళనలు చేపట్టి అరెస్టు చేయాలని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో పోలీసులు నిందితుడు చోటేఖాన్ ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ గ్రామస్థులకు తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: