ఆ విషయంలో వెనక్కు తగ్గిన అనిల్ రావిపూడి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అనిల్ రావుపూడి కొన్ని రోజుల క్రితం ఓ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఆ ఈవెంట్ లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ప్రస్తుతం (ఐ పి ఎల్) సీజన్ నడుస్తోంది. ఆ మ్యాచ్ లను చూడడం కోసం ఫస్ట్ షో , సెకండ్ షో సినిమాలను వదిలి వేయకండి. కావాలి అంటే (ఐ పి ఎల్) స్కోర్ లను సెల్ లో కూడా చూడొచ్చు. సినిమాలకు మాత్రం ఖచ్చితంగా రండి (ఐ పి ఎల్) కంటే సినిమాలు ముఖ్యం అని అర్థం వచ్చేలా మాట్లాడారు.

దీనితో సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పై అనేక కామెంట్ లు రాసాగాయి. దానితో ఈ డైరెక్టర్ దిగివచ్చారు. తాజాగా తాను అన్న వ్యాఖ్యలకు వెనక్కు తగ్గారు. తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ మాటలకు ముందు ఓ డిస్ట్రిబ్యూటర్ వేసవిలో సినిమాలకు ఎవరూ రావడం లేదు అని నాతో చెప్పి ఆయన చాలా బాధపడ్డారు. అదే మనసులో ఉండడంతో అలా మాట్లాడా. ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. (ఐ పీ ఎల్) మ్యాచ్ లను చూడండి. ఆ తర్వాత సమయం ఉంటే మా సినిమాలను ప్రోత్సహించండి ఆయన అని ఆయన తెలిపారు.

ఇలా ఆయన (ఐ పీ ఎల్) మ్యాచ్ లపై మొదట అన్న మాటలను వెనక్కు తీసుకున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి ఆఖరుగా బాలకృష్ణ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన భగవంత్ కేసరి సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసి ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: