వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన "మార్క్ ఆంటోనీ"..!

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ పోయిన సంవత్సరం మార్క్ ఆంటోనీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య కీలకమైన పాత్రలో నటించగా ... సునీల్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక రీతూ వర్మ ఈ సినిమాలో విశాల్ కి జోడిగా నటించింది. అధిక్ రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సాలిడ్ కలెక్షన్ లు దక్కగా , తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే థియేటర్ , "ఓ టి టి" ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: