ప్రకృతి దెబ్బకు కకావికలమైన కేరళ రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..!
కట్టుబట్టలతో తిండీ తిప్పలు లేక చాలామంది ఈ తుఫాను దెబ్బకు భీతి చెందారు. దీంతో కేరళ రాష్ట్రం భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఉండటంతో దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. ఇదే క్రమంలో ప్రపంచంలో...దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా కేరళ రాష్ట్రానికి భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ తుఫాను దెబ్బకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలిపోయారు.
దీంతో కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు ఇదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచగా ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కేరళ వరదలను తీవ్రమైన విపత్తుగా ప్రకటించింది. దీని వల్ల కేరళకు జాతీయ విపత్తు నిధి నుంచి సాయం అందుతుంది. ఆగస్టు 18న కేంద్ర బృందం కేరళ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. నష్టాన్ని అంచనా వేసిన హోం శాఖ కేరళ వరదలను తీవ్రమైన విపత్తుగా ప్రకటించింది.
కేరళ వరదలలో ఇప్పటివరకూ ఏడు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం దీనిని తీవ్రమైన పకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సంతోషించింది. ప్రస్తుతం వచ్చిన తుఫాను దెబ్బకు కేరళ రాష్ట్రంలో అధికారికంగా 20వేల కోట్ల ఆస్తి మేరకు నష్టం వాటిల్లిందని సమాచారం.