ఆ విషయంలో చంద్ర బాబు జీరో అయ్యాడు.. జగన్ హీరో అయ్యాడు..!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇంకా బతికి ఉందంటే దానికి కారణం ఏపీ ప్రతిపక్ష నేత వైస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విషయం మీద పచ్చ నాయకులను అడిగిన అదే వవిషయం చెబుతారు. ఈ విషయం లో మాత్రం జగన్ హీరో అయ్యాడు. బాబు జీరో అయ్యాడు పూటకో మాట మాట్లాడి జనాల్లో ఏపీ సీఎం విశ్వాసం కోల్పోయాడు. దీనితో బాబు డిఫెన్సె లో పడ్డాడు. పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడిన మాటలు ఇందుకు నిదర్శనం. 


ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు, వైసీపీ ట్రాప్ లో పడ్డారని, అందుకే యూటర్న్ తీసుకున్నారని అన్నారు మోడీ. అలా పరోక్షంగా ఏపీ ప్రత్యేకహోదా ఉద్యమం క్రెడిట్ అంతా జగన్ ఖాతాలోనే వేశారు. ప్యాకేజీకి ఒప్పుకోకుండా, జగన్ తరహాలో మొదట్నుంచి ఒకేమాట మీదుంటే బాబు ఇప్పుడిలా బీద అరుపులు అరవాల్సిన అవసరం వచ్చి ఉండేదికాదని పరోక్షంగా కుండబద్దలుకొట్టారు మోడీ. 


మొదట్నుంచి బాబువి రెండునాల్కలు. హోదా కావాలన్న నోటితోనే ప్యాకేజీ బెస్ట్ అన్నారు. సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు మళ్లీ హోదా కావాలంటున్నారు. పచ్చ మీడియా సాయంతో గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు దేన్నయినా కప్పిపుచ్చొచ్చు. కానీ ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని మాత్రం తక్కువచేసి చూపలేకపోయారు. దీనికి ఉదాహరణే ప్రధాని ప్రసంగం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: