పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు లోకేష్ కు మతి పోయింది..!
ముఖ్యంగా గత ఎన్నికలలో తన మద్దతు తీసుకుని తనకే వెన్నుపోటు పొడిచారని అన్నారు పవన్. వాటిలో ముఖ్యంగా నారా లోకేష్ కరప్షన్ కింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు నారా లోకేష్ అవినీతి మీకు కనబడడం లేదా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. లోకేష్ అవినీతి గుర్తు చేస్తు చంద్రబాబు రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రా చేశారని మండిపడ్డారు. 2019ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మీ కొడుకు నారా లోకేష్ అవినీతి పాల్పడుతున్నారని అన్నారు.
మీ అబ్బాయి అవినీతి మీకు కనిపించడంలేదా..? కనిపించినా మీరే మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా లోకేష్ రాజకీయ ఎంట్రీ పై సెటైరికల్ కామెంట్లు చేశారు పవన్...చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ఎంతటి సమర్ధుడో తెలుసు కాబట్టే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని అన్నారు. దమ్ముంటే లోకేష్ ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్షం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. మరియు అదే విధంగా చంద్రబాబు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై మండిపడ్డారు...
అభివృద్ధి అంతటా జరగాలి కేవలం రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో తమ మనుషులు ఉన్నారని చంద్రబాబు వారికోసం అక్కడ అభివృద్ధి చేస్తే మిగతా ప్రజలు ఏమైపోతారో అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్రాలో అసలు అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగిన తండ్రీకొడుకులు రాజకీయాలలో ఉంటే రాష్ట్రంలో మనం మన పిల్లలు ఇలానే నించుని ఉండాల్సి ఉంటుంది వాళ్లు మాత్రం అధికారం సంపాదించి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.