ఏపీ హోం గార్డ్స్ కు శుభవార్త..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ హోం గార్డ్స్ గా విధులు నిర్వహిస్తున్న వారికి సంతోషకరమైన వార్త అందించింది ప్రభుత్వం.  గత కొంత కాలంగా హోం గార్డ్స్ తమ  వేతనాలు పెంచాలని కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  హోం గార్డ్స్ దినసరి వేతనాన్ని రెట్టింపు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

హోం గార్డ్స్ సమస్యలపై సానుకూలంగా స్పందించిన, వారి దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.600కు పెంచుతున్నట్టు, ప్రసూతి (మెటర్నిటి) సెలవులను మూడు నెలలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక హోం గార్డు మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేలు మంజూరు చేస్తామని చెప్పారు.

అంతేకాకుండా, ఎన్టీఆర్ వైద్య సేవలో రెండున్నర లక్షల రూపాయల మేర వైద్య సాయంతో పాటు గృహ నిర్మాణ పథకంలో లబ్ధి చేకూర్చే విషయమై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ వార్త హోం గార్డ్స్ లో ఆనందం చిగురించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: