ఇండియన్ రెస్టారెంట్ లో బాంబు పేలుడు!

Edari Rama Krishna
ఈ మద్య ఉగ్రవాదులు ఎక్కడ నుంచి దాడులు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.  వారి లక్ష్యం ఏదైనా అమాయకుల ప్రాణాలు హరించి వేస్తున్నారు. గత కొంత కాలంగా అఫ్ఘన్ దేశాలో ఈ మారణహోమం విపరీతంగా పెరిగిపోతుంది. అంతే కాదు అమెరికా, ఇంగ్లండ్,కెనడా, పారిస్ లాంటి దేశాల్లో కూడా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా కెనడాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ ముందు బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు.

క్షతగాత్రులను టొరంటో ట్రామా సెంటర్‌‌కు చికిత్స కోసం తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. హురాంటోరియా వీధిలో ఉన్న బాంబే బేల్ ఏరియాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు.ఒంటారియాలోని మిస్సిసౌగా ప్రాంతంలోని బాంబే బెల్ అనే ఇండియన్ రెస్టారెంట్ వద్ద ఈ బాంబు పేలింది. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.పేలుడు ఘటనా స్థలంలో ఉన్న వారు అరుపులు, కేకలతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

కాగా, ఈ బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అతను డార్క్ రంగులోని పూర్తి చేతులతో ఉన్న షర్ట్‌ వేసుకున్నాడు. ముఖాలకు నల్ల ముసుగు ధరించారు.  బిల్డింగ్‌‌లోని ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది, ఆ సమయంలో ఎంతమంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: