20 నుండి బ‌స్సు యాత్ర‌..రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌లు

Vijaya
తెలుగు రాష్ట్రాలో జనసేన పార్టీ పటిష్టను పెంచేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ తన కార్యాచరణ మొదలు పెట్టారు.  గతంలో తెలంగాణ, ఏపిలో పర్యటన చేసిన ఆయన మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు సన్నద్ధం అవుతున్నారు.  ఇప్పటి వరకు తిరుమల పర్యటన చేస్తూ వచ్చిన పవన్ కల్యాన్   ఈనెల 20 తేదీనుండి బ‌స్సు యాత్ర మొద‌లుపెడుతున్నారు.

ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ తో ప‌వ‌న్ మొద‌లుపెడుతున్న ఉద్య‌మం శ్రీ‌కాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి ప్రారంభం అవుతుంది. త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను ప‌వ‌న్ గురువారం మీడియాతో చెప్పారు. ప్ర‌త్యేక‌హోదా రాక‌పోతే రాష్ట్రం వెన‌క‌బ‌డిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వేర్పాటు వాద విధానాల వ‌ల్లే వెనుక‌బాటుద‌నం మొద‌లైంద‌న్నారు.

ప్ర‌భుత్వం ఇదే విధమైన విధానాల‌ను అనుస‌రిస్తుంటే ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న తీవ్ర‌స్ధాయికి చేరుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలోని మొత్తం  175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆందోళ‌నలు తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: