పవన్ గుండు పై క్లారిటీ ఇచ్చిన పరిటాల సునిత..!

Edari Rama Krishna
ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ సుడిగాలి పర్యటన చేసిన విషయం తెలిసిందే.. అయితే విశాఖలో మొదలైన పవన్ టూర్ ఒంగోలులో కృష్ణా నదిలో పడవ మునిగిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించే వరకు సాగింది.  అయితే విజయవాడలో పవన్ కళ్యాన్ జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..గతంలో తనకు దివంగత నేత పరిటాల రవి గుండు గీయించారని పుకార్లు షికార్లు చేశాయని...తనకు ఎవ్వరూ గుండు గీయించలేదని..అలా గుండు గీయిస్తే తాను ఊరుకునే మనిషినేనా అని అన్నాడు.

మీడియాలో కథనాలు వచ్చాయని, కావాలనే కొందరు టీడీపీ నేతలు ఇలా ప్రచారం చేశారని పవన్ తెలిపారు. తాను కావాలనే గుండు చేయించుకున్నాని చెప్పారు.  దీనిపై  పరిటాల రవి భార్య, మంత్రి పరిటాల సునీత కూడా స్పందించారు. నా భర్త పవన్‌కు గుండు కొట్టించేంత మూర్ఖుడు కాదని చెప్పారు. పవన్‌కు ఆయనెందుకు గుండు కొట్టిస్తారని ప్రశ్నించారు. పరిటాల, పవన్ మధ్య ఎలాంటి గొడవలు లేవని సునీత క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో పరిటాల ఇంటి పక్కన ఉన్న స్థలం కొనుగోలు చేయాలని చిరంజీవి అనుకొన్నారట. కానీ భద్రతాపరమైన సమస్యలు ఉండటంతో ఆయన రవి వద్దని చెప్పారు. దీంతో మెగాస్టార్ కూడా ఆ స్థలం తీసుకోలేదు. ఆ ఒక్క విషయం మినహా చిరంజీవి ఫ్యామిలీలో ఎవరితోనూ తనకు ఎలాంటి సమస్యలు లేవని పరిటాల గతంలోనే చెప్పారు. పవన్‌తో నాకు అసలు పరిచయమే లేదన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: