కన్న తల్లిని అత్యంత పాశవికంగా పొడిచి చంపాడు..అందుకేనా..!

Edari Rama Krishna
ఈ మద్య యువత పెడదోవ పడుతుందని చెప్పడానికి మరో ఉదాహారణ ఓ యువకుడు తల్లిని హత్య చేసి పారిపోయి పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.  వివరాల్లోకి వెళితే.. ఆ మద్య భారత దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.   కత్తిపోట్లకు గురైనా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని ముంబై శాంతాక్రజ్ లోని ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. అయితే అంత దారుణంగా కసితో కత్తి తో పొడిచిన వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

అంతే కాదు హత్య జరిగిన మృతదేహం పక్కన  నేలపై రక్తంతో రాసినట్టుగా భావిస్తున్న నోట్ వంటిది కూడా వారు గమనించారు. ఆమెతో విసుగెత్తి పోయా. నన్ను పట్టుకుని ఉరి తీయండి అని రాసి ఉంది. ఇలా రాసిందెవరని, ఈ దారుణానికి పాల్పడిందెవరని ఆరా తీస్తే ధ్యానేశ్వర్, దీపాలీల 21 ఏళ్ళ కొడుకు సిద్దాంతేనన్న అనుమానం బలపడింది. అయితే తల్లీ కొడుకుల మద్య ఉన్న ఇబ్బందులు ఏమిటీ..వారికి ఏ విషయంలో తేలడాలు వచ్చాయి..తల్లి అంటే అంత కసి ఎందుకు పెంచుకున్నాడు అన్న నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు.  

హత్య జరిగిన రాత్రి నుంచి ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. సిద్దాంత్  జైపూర్ కు పారిపోయాడన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు వెంటనే ఓ బృందాన్ని అక్కడికి పంపారు. అయితే ఆ పోలీసు బృందం అక్కడికి చేరేలోగానే  అప్పటికే జోద్ పూర్ వెళ్లి పోయాడని తెలిసి అతని ఫోటోను అక్కడి పోలీసులకు పంపగా అతడ్ని అరెస్టు చేశారని ముంబై ఖాకీలు చెప్పారు. అయితే సిద్దాంత్ ని పట్టుకుంటే అసలు నిజం బయట పడుతుందని నేరస్తుడు ఎవరనేతి నిర్ధారణ అవుతుందని పోలీసులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: