జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థత..ఐసీయూలో చికిత్స..!

Edari Rama Krishna
హిందూ ఆధ్యాత్మిక గురువు, కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ఈ రోజుల అకస్మాత్తుగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను సూర్యారావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో ఉన్న ఐసీయూలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గత కొంత కాలంగా శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు అది తీవ్రం కావడంతో గమనించిన శిష్యులు వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఐదుగురు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్యంపై కాసేపట్లో ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: