ఏపీ: రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారా..?

Divya
సినిమాలలో సరికొత్త ట్రెండ్ చెక్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ పాలనలో కూడా ఇప్పుడు మరొకసారి ట్రెండ్ సెట్టర్గా నిలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. డిప్యూటీ సీఎం గా పిఠాపురం అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలోని సమస్యల పైన కూడా అడిగిమరీ తెలుసుకుంటున్నారట. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరు పైన పలు రకాల సర్వేలు చేయిస్తూ సరికొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. పిఠాపురంలో అనేక సమస్యలను గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపైన అసహనాన్ని తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.

పిఠాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా చూడాలని అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ అన్ని శాఖల వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది.అలాగే పార్టీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలను కూడా నిర్వహించారట. పిఠాపురం పై వరుసగా సమీక్షలు చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలోనే జిల్లా హెడ్ క్వార్టర్లు కలెక్టర్గా చేపట్టి ప్రజా సమస్యలను సైతం పరిష్కరించే వేదిక లాంటి కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్లాస్టిక్ భూతం పైన కూడా మరొక యుద్ధాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ పైన రివ్యూ చేసిన పవన్ కళ్యాణ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా అందుకు తగ్గ ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గ పిఠాపురం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా చూడాలని విధంగా అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో పిఠాపురంలో మున్సిపాలిటీ సిబ్బంది పనితీరు పైన అధికారులు కూడా సర్వే చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ప్లాస్టిక్ నియంత్రపైన పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: