పెద్దిరెడ్డి కుటుంబానికి వరుస షాకులు..మిథున్‌ రెడ్డి అరెస్ట్‌?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... ఆ పార్టీలో ఉన్న కీలక నేతలకు చిక్కులు ఎదురవుతున్నాయి. వైసీపీలో ఉన్న కీలక నేతలపై... కేసులు కూడా పెడుతున్నారు. అడుగడుగున వైసిపి నేతలను అడ్డుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ నేపథ్యంలోనే... జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి కుటుంబానికి... చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకు.. అటు టిడిపి నేతలు కూడా... చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా... వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని... పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామున... తిరుపతిలో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటిని... పోలీసులు చుట్టుముట్టారు.  వాస్తవానికి ఇవాళ పుంగనూరులో పర్యటించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భావించారు. కీలక నేతలు వైసిపి పార్టీని వీడుతున్న నేపథ్యంలో...  కార్యకర్తల్లో మనో ధైర్యం నింపేందుకు... పుంగనూరు పర్యటనకు వెళ్లే దలుచుకున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించాలని భావించారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో... పోలీసులు.. అలర్ అయి... ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని హౌస్ అరెస్టు చేశారు. పుంగనూరుకు మిథున్ రెడ్డి వెళ్తే... ఆ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతాయని... పోలీసులు హెచ్చరించారు. అందుకే పుంగనూరుకు మిధున్ రెడ్డి వెళ్లకుండా... హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయినప్పటికీ తాను... పుంగనూరు వెళ్లాల్సిందేనని... ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటున్నారు. దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటిదగ్గర తీవ్ర ఉదిక్త వాతావరణం నెలకొంది. కాగా వారం రోజుల కిందట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...  పుంగనూరుకు రాకుండా టిడిపి ఇన్చార్జి చాలా బాబు అడ్డుకున్నారు. అంతేకాకుండా 13 మంది పుంగనూరు కౌన్సిలర్లను.... టిడిపిలో జాయిన్ చేయించుకున్నారు. అటు  పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కూడా టిడిపిలో చేరిపోయారు. ఇలా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అడుగడుగునా.. టిడిపి ఇబ్బందులు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: