ఏపీ: ఆ మంత్రి భార్యకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ కొంతమందికి మాత్రమే అదిదక్కింది. అయితే నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదకరంగా మారుతున్నది. మంత్రి భార్య తీరు పైన చాలామంది తీవ్రమైన విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లగా దీంతో ఆయన మంత్రి రాంప్రసాద్ భార్య తీరుపైన ఫైర్ అయినట్లుగా సమాచారం.

పోలీసులతో మంత్రి భార్య హరిత రెడ్డి వ్యవహరించిన తీరు చంద్రబాబుకి కాస్త అసంతృప్తినే కలిగించినట్లు తెలుస్తోంది. మంత్రితో ఫోన్ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటన పైన వివరణ ఇవ్వాలంటూ కోరారుట అధికారులు ఉద్యోగుల పట్ల ఎవరైనా ఆగౌరవంగా మసులుకుంటే వారిని ఉపేక్షించేది లేదు అంటూ తెలిపారు. ప్రభుత్వానికి ఎవరు చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరించిన సహించేది లేదు అంటూ కూడా చంద్రబాబు హెచ్చరించారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని తెలియజేసినట్లు సమాచారం.
రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత ఒక సీనియర్ పోలీస్ అధికారితో మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఈ వీడియోలో తెల్లారిందా.. మీకోసం మేము ఎదురు చూడాలా మీకు జీతాలు ప్రభుత్వమే కదా ఇస్తున్నది వైసిపి వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా అంటూ మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం వెంటనే వెళ్లి.. కాన్వాయిన మొదలుపెట్టండి అంటూ పోలీస్ పైన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అసహనాన్ని తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వైసిపి సోషల్ మీడియా మంత్రి గారి భార్య రాయచోటిలో పోలీసులకు బానిసలు అంటూ వార్నింగ్ ఇస్తున్నారంటూ ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: