జగన్:ఉద్యోగులు ఓడించడానికి ముఖ్య కారణాలు ఇవే..?
వారం రోజులు కాస్త కమిటీలు కూడా అయ్యాయి.. చిట్టచివరిలో వచ్చేసరికి సిపిఎస్ బదులు జిపిఎస్ ఇచ్చారు.. అయితే వారు కోరుకుంది మాత్రం ఓపిఎస్. ఇది ఒక ఎత్తు అయితే ఆ సమయంలోనే పిఆర్సి విషయంలో కూడా వారు ఎక్స్పెక్ట్ చేసింది.. చంద్రబాబు సమయంలో 42 దాకా రావడం.. జగన్ టైంలో ఇంకో రెండు మూడో ఎక్కువ విస్తారని ఆశించారు. కేవలం 27 మధ్యంతర భృతి ఇచ్చి.. తర్వాత ఎప్పుడైతే దాంట్లో నాలుగు తగ్గించారు... 23 దగ్గర ఆగడం.. ఈ విషయం కూడా ఉద్యోగులను కోపాన్ని తెప్పించింది.
వీటికి తోడుగా వారి వర్కులకు సంబంధించి తీసుకువచ్చినటువంటి అంశం.. ఒకటో తారీకు జీతం రాకపోవడం ఒక ఎత్తు.. అలాగే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు లోన్స్ అనేవి రాకుండా పోవడం.. ఇదంతా ఉద్యోగులను తీవ్ర ఉద్రిక్తకు కారణమయ్యింది. అలాగే పనికి సంబంధించినటువంటి వాటిలో టైముకు వచ్చేటువంటి విషయాలు కాబట్టి.. ముఖ్యంగా ఉద్యోగులను ట్రోల్ చేశారు.. టీచర్లకు సంబంధించి కొన్ని లోపాలు ఎత్తి చూపెట్టడం కావచ్చు.. టీచర్లకు సంబంధించి కేటాయించిన విధుల వల్ల కూడా కావచ్చు.. ఓవరాల్ గా ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత అన్నటువంటిది ఏర్పడింది. అలాగే ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీసుకుని నిర్ణయమే వైసీపీకి దెబ్బగా మారింది.