తెలుగు డైరెక్టర్ల దెబ్బకి వణికిపోతున్న బాలీవుడ్?

Purushottham Vinay

 దాదాపు ఓ పది సంవత్సరాల కాలం నుండి టాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ అబ్బా అంటూ గడ గడ వణికిపోతుంది. మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళ విజయాలు అక్కడి సో కాల్డ్ మాఫియాకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.మొత్తానికి భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమే అన్న రీతిగా పరిస్థితి మారింది. దీని కారణం వెనుక తెలుగు దర్శకుల కృషి, పట్టుదల ఎంతో ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్  సినిమానే అన్న నానుడి ఉండేది. అంత బలంగా డామినేషన్ ఉండేది. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు గతంలో వచ్చినా బాలీవుడ్ మాఫియా వల్ల లైట్ లోకి రాలేదు.బాలీవుడ్ లో అక్కడ ఓ వర్గంవారు మాత్రమే ఆధిపత్యం చెలాయించేవారు. మా వాళ్ళు మాత్రమే ఎదగాలి, మా వాళ్ళు తీసినవి మాత్రమే సినిమాలు, వీరు మాత్రమే స్టార్స్ అంటూ కుంచిత మనస్తత్వంతో కుళ్ళిపోయి, కంపు కొడుతున్న బాలీవుడ్ మాఫియా గర్వాన్ని అణచివేశారు మన తెలుగు డైరెక్టర్స్. 


ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్ కి రీచ్ అవ్వడం నేడు మనకి ఎంతో గర్వంగా ఉంది.దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంకా నాగ్ అశ్విన్... తెలుగోళ్ళ పవర్ ఏంటో బాలీవుడ్ కి చూపించారు. చూపిస్తున్నారు కూడా.. బాహుబలి 2 తో ఆలిండియా ఇండస్ట్రీ హిట్, ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ హిట్ కొట్టాడు రాజమౌళి. కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగ ఆ హీరోలకి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమాతో బాలీవుడ్ కి గ్రాఫిక్స్ సినిమా అంటే ఏంటో చూపించి 600 కోట్ల బడ్జెట్ తో ఇంత క్వాలిటీగా సినిమా తీయొచ్చా అని నిరూపించాడు నాగ్ అశ్విన్.. ఒక తెలుగు హీరో బాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాదని వరుస పాన్ ఇండియా సినిమాలు తీస్తూ బాలీవుడ్ కే కాదు టాలీవుడ్ హీరోలకి కూడా రోల్ మోడల్ అయ్యాడు ప్రభాస్.ఇలా మన తెలుగోళ్ళ దెబ్బకి బాలీవుడ్ గజ గజ వణికిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: