జగన్ కు షాక్.. టిడిపిలోకి జంప్ అయ్యే మొదటి ఎమ్మెల్యే ఆయనేనా..?

Pandrala Sravanthi
టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఆ 24 మందికి శాఖలు కూడా కేటాయించారు. ఈ తరుణంలో మొదటిరోజు  పాలన మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు. ఇదే తరుణంలో  వైసిపి నాయకులపై దాడులు ప్రతిదాడులు త్వరలోనే జరగబోతున్నాయి అన్నట్టు సాంకేతాలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా జగన్ కు వచ్చినటువంటి 11 ఎమ్మెల్యేలను కూడా  చంద్రబాబు నాయుడు ఎలాగోలా లాక్కు రావాలని  అసలు వైసీపీని జీరో చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 ఇక జగన్మోహన్ రెడ్డి వారిని ఎలా కాపాడుకోవాలి అసలు జనాల్లోకి ఎలా వెళ్లాలి అనేదానిపై తర్జనభర్జన  అవుతున్నారట. అసలు అసెంబ్లీలో అడుగు పెడితే  అంతమంది ఎమ్మెల్యేలు  ఒక్కసారిగా జగన్ పై ముక్కుమ్మడి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా భయపడుతున్నారట. అలాంటి ఈ తరుణంలో  11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జగన్  సర్వశక్తులన్నీ వడ్డుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఈ క్రమంలో  వైసీపీని వీడి టిడిపిలోకి వెళ్లే మొదటి ఎమ్మెల్యే  ఆయనే అంటూ అనేక వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  కర్నూలు జిల్లాలో మొత్తం రెండు స్థానాల్లో మాత్రమే వైసిపి గెలిచింది. అందులో ఆలూరు ఎమ్మెల్యే  విరూపాక్ష త్వరలోనే జంప్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే పూర్తిస్థాయిలో టిడిపి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వైసిపి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోవాలంటే తప్పక టిడిపిలోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట. అయితే విరూపాక్షి పార్టీ మారితే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఆయన పార్టీ మారుతారా లేదంటే జగన్ కు సపోర్ట్ గానే నిలుస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: