చంద్రబాబు : సీఎంగా తన మార్క్ చూపిస్తున్న బాబోరు..!

FARMANULLA SHAIK
ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో నిరుద్యోగులు,పేదల పట్ల తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగాదూసుకుపోతున్నారు.ఈరోజు సీఎం చంద్రబాబును తన కార్యాలయంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కూతురుతో వచ్చి కలిశారు.కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నానని అలాగే వేధింపులకు కూడా గురయ్యానని ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె అయినా సాయిలక్ష్మీ చంద్రకు వెన్నులో కణితి రావడంతో ఆమె తీవ్ర అనారోగ్యనికి గురైందని అప్పుడు సీఎం జగన్ కార్యాలయానికి వచ్చామని అయితే అక్కడ తమని ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. అయితే గతంలో తన బిడ్డ వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో ఆమెకు చాలా రకాలుగా కష్టాలు ఎదురయ్యాయని చెప్పారు.అమలాపురంలో తనకున్న స్థలం అమ్మే విషయంలోప్రస్తుతం కూడా బాగా ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం  ప్రకటించారు. అలాగే ఆమెకు ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ ఇచ్చేటట్లు చేస్తానని చెప్పారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై కూడా తన మేరకు సహాయ సహకారాలు అందిస్తానని మాటిచ్చారు. దానికి ఆమె భావొద్వేగానికి లోనై చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని ఆమె అన్నారు. అయితే సిఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర చాలా సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తన సమస్యను అప్పటి సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా దానిపై ఎవరు స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి తనను మానసికంగా బాగా హింసించారని అన్నారుదాంట్లో భాగంగానే ఆమెకు పిచ్చిదాన్ని అనే ఒక టాగ్ కూడా అంటించారని కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న సీఎం చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పి తనకు  అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: