నా భార్యని తిట్టారంటూ ఎమోషనల్ అయిన పవన్?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నేటి సాయంత్రంతో మైకులు మ్యూట్ అవుతాయి.. ప్రచారాలు ఉండవు.ఇక ఆదివారం నాడు మౌనవ్రతం తరువాత సోమవారం నాడు ఉదయాన్నే పోలింగ్ మొదలవ్వబోతోంది. ఇక ఈ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటని అందరికి తెలిసిన సంగతే. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ రోజు సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది. దీంతో... ప్రధాన రాజకీయ పార్టీలు చాలా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలో కూడా ఓడిపోవడం జరిగింది.అందుకే పవన్ ఈసారి బీజేపీ, టీడీపీలతో కూటమిగా ఏర్పడి పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడ నుంచి బరిలో నిల్చున్నారు.


దీనితో ఈసారి ఆయన విజయం ఖాయమని జనసైనికులు భావిస్తుండగా.. ఈసారి కూడా పవన్ కు షాకివ్వాలని వైసీపీ ఫిక్సయ్యింది. ఈ నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని పలువురు సినీ జనాలు పిఠాపురంలో బాగా ప్రచారం చేస్తున్నారు.ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించమని పిఠాపురం ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా తన సొంతవారిని, ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తన భార్యతో జరిగిన అనుభవాన్ని పంచుకోని ఎమోషనల్ అయ్యారు.నా భార్యని తిట్టారు.. ఆమె విదేశీయురాలు.. ఆమెకి ఇక్కడి రాజకీయాలు ఏవి తెలియవు.. ఎందుకు తిడుతున్నారు అని నన్ను అడిగింది.. భారతదేశంలో రాజకీయాలు అర్ధం కావు.. నన్ను క్షమించు అని తన భార్యను కోరినట్లు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదే సమయంలో నీకు ఎందుకు ఇంత పిచ్చి అని ఆయన భార్య అడిగితే.. ప్రజల కోసం నిలబడటానికే నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: