ప్రజా గళం: మోదీని ఆకాశానికెత్తేస్తున్న లోకేష్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ హీట్ పుట్టేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా మాటలతో పాటు ఒకరి పైన ఒకరు దూషిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ రోజున ప్రధాన మోడీ రాజమండ్రి ప్రజా గళం సభకి హాజరయ్యి మాట్లాడడం జరిగింది.. ఆ తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రధాన మోడీని ఉద్దేశించి ప్రసంగాలతో పొగడ్తలతో ముంచేశారు.. ముఖ్యంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఇండియాని మోడీ తీర్చి దిద్దుతారు అంటూ కూడా వెల్లడించారు నారా లోకేష్.

రాజమండ్రిలోని వేమగిరిలో కూటమి తరపున నిర్వహించినటువంటి ఈ సభలో లోకేష్ పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా నారా లోకేష్ కూడా మోడీ గురించి మాట్లాడుతూ మోడీ దేశానికి చాలా అవసరమని.. నమో నమో అని కేవలం నాలుగు అక్షరాలతో దేశం దిశ మార్చేస్తున్నారంటూ కూడా తెలియజేశారు.తెలుగు పౌరుషాన్ని దేశానికి ఎన్టీఆర్ పరిచయం చేస్తే.. ప్రపంచానికి సైతం మన దేశ పౌరుషాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా మోడీ ఉన్నారంటూ లోకేష్ వెల్లడించారు..

దేశంలో బాగా కుల సైతం ప్రధాని మోడీకి బాగా తెలుసు అని దేశంలో పేదరికం లేకుండా చేయడమే ఆయన లక్ష్యం అంటూ కూడా వెల్లడించారు. చంద్రబాబు పవన్ కలయికతో కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందనుకున్నాము మోదీ గారి కలయికతో ఈసారి మరింత నమ్మకం కలిగింది అంటూ కూడా లోకేష్ తెలియజేశారు. జగన్ పాలనలో యువతే ఎక్కువగా బాధితులుగా ఉన్నారని తెలియజేశారు లోకేష్.. చంద్రబాబు తీసుకువచ్చిన కంపెనీలను సైతం ఇతర రాష్ట్రాలకు కూడా పంపించారు జగన్ అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.. జగన్ 59 నెలల పాలనలో రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రాలేదంటూ ఎద్దేవా చేశారు ఉభయగోదావరి జిల్లా ప్రజలు తప్పకుండా కూటమిని గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాము అక్కడి వారి మమకారం, వెటకారం సూపర్ గా ఉంటుందంటూ నారా లోకేష్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: