టీడీపీ: నేతల తీరుతో తమ్ముళ్లలో ఓటమి భయం?

Purushottham Vinay
ఎన్నికలు ఫలితాలు సమీపిస్తున్నా కూడా టీడీపీ ముఖ్య నేతలు మౌనంగా ఉన్నారు. గతంలో ఎన్నికలు జరిగిన రోజు లేదా ఆ మరుసటి రోజు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొచ్చేవారు. ఫలితాలు ఎలా వస్తాయనేది ఊహిస్తూ తమ గెలుపుపై బాబు కామెంట్స్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సమయంలో వారణాసి వెళ్లినప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ చానల్‎తో మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని బాబు చెప్పారు. అది తప్ప ఇంకెక్కడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తర్వాత బాబు విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఇక నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి ముఖ్య నేతలు కూడా గెలుపుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక పార్టీలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం రాష్ట్రంలో జరగుతున్న రోజువారీ పరిణామాలపై ఈసీని లేదా డీజీపీని కలిసి ఫిర్యాదులు చేయడం తప్ప ప్రభుత్వం ఏర్పాటుపై చిన్నమాట కూడా మాట్లాడటం తెలుగుదేశం తమ్ముళ్ళని టెన్షన్ పెడుతుంది.ఎన్నికల ఫలితాలపై వైసీపీ పార్టీ నేతలు గెలుపుపై ధీమాగా ముందుకెళ్తున్నారు.


గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం అంటూ ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత కాకపుట్టించాయి. ఓవైపు అధికార పార్టీ తమకున్న అంచనాలతో వేగంగా ముందుకెళ్తుంటే తమ పార్టీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారో తెలియక తెలుగు తమ్ముళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారట. అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు మాత్రం స్థానిక పరిస్థితుల ఆధారంగా గెలుపోటములపై ఇప్పటికే కేడర్‎కు కొన్ని సంకేతాలు ఇస్తున్నారని తెలుస్తుంది. అయితే తమ నేతల మౌనం గెలుపునకు కారణమని చెబుతున్నారట.  అధికారంలోకి వచ్చే సమయంలో అనవసర ప్రకటనలు ఎందుకులే అని నేతలు మౌనంగా ఉన్నారట.  టీడీపీతో పాటు మిత్రపక్షంగా ఉన్న జనసేన ఇంకా బీజేపీ నేతలు కూడా అసలు ఎన్నికలపై మాట మాత్రం మాట్లాడకపోవడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీస్తుంది.పార్టీ నేతల అంచనాలు ఎలా ఉన్నా కానీ కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంపై మరింత ఆందోళన చెందుతున్నారట టీడీపీ ఫ్యాన్స్. అయితే పార్టీ నేతల మౌనం ఎలాంటి ఫలితాలకు దారి తీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు కార్యకర్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: