ఏపీలో సంచలనం రేపుతున్న సర్వే ఫలితాలు.. అధికారం ఎవరిదంటే?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల వేళ విపక్షాలు ప్రచారాలను చాలా వేగవంతం చేసినట్టు కనబడుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు? అని ఏ పార్టీని అడిగినా... వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని, కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అని చెప్పడం అయితే చాలా సర్వ సాధారణం. ఇందులో మనం ఎవర్నీ తప్పు బట్టడానికి లేదు. ఎందుకంటే, ఎవరి అభిప్రాయం వారిది. ఈ తరుణంలో ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిని ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, ఈ సర్వేలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్ర బాబు అరెస్టై అయిన తర్వాత.. ఏపీలో సీఎం జగన్‌కి వ్యతిరేక వేవ్ వచ్చిందనీ, టీడీపీ వేప్.. అండర్ కరెంట్ లాగా ఏపీ అంతటా పాకిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వెలువడ్డ పోల్ కారణంగా టీడీపీ కూటమికి 52 శాతం ఓట్లు వస్తాయనీ.. వైసీపీకి 40 శాతం మాత్రమే వస్తాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఈసారి కూటమివైపు మళ్లినట్లు సమాచారం రాగా అదే సమయంలో పెద్దవారు, ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు... వైసీపీకే ఓటు వెయ్యాలనుకుంటున్నారని భోగట్టా. అదే విధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారనీ, బిజినెస్ కమ్యూనిటీ కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని సర్వేలో తేల్చి చెప్పారు.
ఇకపోతే బాబు తమ కూటమి మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత.. టీడీపీ వేవ్ మరింత తీవ్రం అయ్యిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. 3 ఉచిత సిలిండర్ల పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు మహిళా ఓటర్లను ఆకర్షిస్తున్నాయనీ.. అదేవిధంగా ఏపీలో తాగు నీటి సమస్య బాగా ఉండగా.. ప్రతీ ఇంటికీ వాటర్ ట్యాప్ వేయిస్తామని కూటమి ఇచ్చిన హామీ సైలెంటుగా ప్రభావం చూపిస్తోందని తాజా సర్వేలో తేలింది. ప్రజల్లో ఎంతో హైప్ కలిగివున్న వైసీపీ మేనిఫెస్టో, రిలీజ్ అయ్యాక.. ఆ హైప్‌ని అందుకోవడంలో ఫెయిలైందనీ.. కొత్త పథకాలు లేకపోవడం ఆసక్తిని పోగొట్టిందని కూడా అందులో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: