ఏపీ : గ్లాస్ తో 'సిద్ధం' అంటున్న అంబటి రాయుడు.?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైనది అన్నీ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఇటీవల వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు వెంటనే ఆ పార్టీలో నుండి బయటకి వచ్చేసారు. అయితే ఆయన ప్రస్తుతం ‘సిద్ధం’ అంటూ మరలా అన్నాడు.దాంతో చాలా మందికి ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన క్రికెట్‌కి గుడ్ బై చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదట వైసీపీలో చేరాడు.అయితే అప్పట్లో వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది.ఆ పార్టీ సొంత నేతలే వైసీపీ గుంటూరు అభ్యర్థిగా అంబటి రాయుడు అంటూ  మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.అలాగే వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే ప్రచారం చేసింది. సడెన్ గా ఏమయ్యిందో తెలీదు కానీ అంబటి వైసీపీని వీడారు. ప్రస్తుతం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారని తెలుస్తుంది.
అయితే మరోపక్క క్రికెట్ లీగ్ నేపథ్యంలో రాజకీయాలకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించి నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పిన అంబటి మరలా జనసేనతో చేతులు కలపడం అదే పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడికి అవకాశం దక్కడం చూస్తుంటే జనసేన పార్టీలో ఆయన కలిసినట్లు తెలుస్తుంది. అదే  ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది.నాగబాబు, హైపర్ ఆది, అంబటి రాయుడు తదితరులతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టుని జనసేన పార్టీ తాజాగా ప్రకటించింది. అసలు అంబటి చేరడా? లేదా? అనేది జన సైనికుల్లో కొంత ఆందోళన వుంది.
అయితే పోతిన మహేష్ వ్యవహారం తర్వాత, జనసైనికులు మాత్రం ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నట్లు తెలుస్తుంది.అంబటి రాయుడు కీలక సమయంలో మరలా పార్టీలోనుండి బయటకు వెళ్లడని నమ్మకం ఏంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.కాగా, జనసేన తరఫున ఎన్నికల ప్రచారం అంటే, కూటమి తరఫున కూడా అంబటి రాయుడు ప్రచారం చేయాల్సి ఉంటుంది మరీ దానిపై అంబటి ఎలా స్పందిస్తాడో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: