ఆ మత పెద్దలపై బ్రిటన్ నిషేధం విధిస్తుందా?

Chakravarthi Kalyan
బ్రిటన్ లో మత ఉన్మాదులు పెరిగిపోయారు. క్రైస్తవ అమ్మాయిలపై లైంగిక వేధింపులు,  అత్యాచారాలతో పాటు వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో విరక్తి చెందిన బ్రిటన్ పౌరులు రోడ్లెక్కి ఆందోళన బాట పట్టారు. మరోవైపు నమాజ్ చేసుకోవడానికి మసీదులు ఉన్నా కానీ.. మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కావాలనే  రోడ్లపై ప్రార్థనలు చేయడం వంటివి చేస్తున్నారు.

దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అక్కడి ముస్లింలను ఏకం చేస్తున్నారు. అక్కడి బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్నారు. దీనంతటకి కారణం మత పెద్దలే అని బ్రిటన్ ప్రభుత్వం భావించింది. అందుకే వారిపై నిషేధం విధించింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి వచ్చే అతివాద ఇస్లామిక్ దృక్ఫథాలు కలిగిన మత బోధకులను నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ద్వేష పూరిత ప్రసంగాలు ఇచ్చే మత బోధకులు బ్రిటన్ లో అడుగు పెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిరోధించినట్లు యూకే మీడియా తెలిపింది.

ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. బ్రిటన్ లో తీవ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి తీవ్రవాదులు రాకుండా .. వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంది. అలాంటి వారిని గుర్తించి వీసా వార్నింగ్ లిస్ట్ లో చేర్చేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లండన్ లోని 10 డౌనింగ్ స్ర్టీట్ దగ్గర ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. తీవ్రవాదుల వల్ల బ్రిటన్ లో ప్రజాస్వామ్యం, బహుళ విశ్వాస విలువలకు ముప్పు కలుగుతుందని ఆరోపించారు. దేశంలోకి ప్రవేశించే అతివాదులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించారు. మరో వైపు వీసాలపై ఉన్న వారు నిరసనలపై ద్వేషాన్ని రెచ్చ గొట్టాలని లేదా ప్రజలను భయ పెట్టాలని చూస్తే వారి వీసాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: