PF హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. మీ మనీ ఇక డబుల్!

Purushottham Vinay
ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించనుందా.. అంటే అవుననే సమాచారం తెలుస్తోంది. ఈపీఎఫ్ వో పెన్షన్ డబ్బులను డబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇదే గనుక జరిగితే పీఎఫ్ చందాదారులకు ఊరట కలుగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం సబ్‌స్క్రైర్లకు నెలకు రూ.1000 పెన్షన్ మాత్రమే వస్తుంది. ఇక ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. అందుకే కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పెన్షన్ డబ్బులను పెంచాల్సిన అసవరం ఉందని పార్లమెంట్ కమిటీ సూచించడం జరిగింది. అంతేగాక పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ని పార్లమెంటుకు సబ్మిట్ చేసింది.ఇందులో పీఎఫ్ పెన్షన్ ని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇక దీని వల్ల 7 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక 8 సంవత్సరాల క్రితం నిర్ణయించిన రూ.1000 ఇప్పుడు చాలా తక్కువని పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.



ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 సమీక్ష కోసం కార్మిక మంత్రిత్వ శాఖ 2018 వ సంవత్సరంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా పెన్షన్ డబ్బులను పెంచాలని సూచించింది.ఇక పీఎఫ్ చందాదారులకు రూ.2 వేల డబ్బులు పెన్షన్ కింద అందించాలని సిఫార్సు చేసింది. దీని కోసం వార్షిక బడ్జెట్‌ను కేటాయించుకోవాలని కూడా తెలిపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు ఏమాత్రం అంగీకరించలేదు. కనీస పెన్షన్‌ను రూ.1000గానే ఆ శాఖ కొనసాగించింది.అంతేకాకుండా తాజా నివేదికలో పలు సమస్యల గురించి కూడా ప్రస్థావించడం జరిగింది. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా కూడా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని నివేదిక తెలిపింది. అలాగే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పోర్ట్ ఫంక్షనింగ్‌లో కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: